info.manatemples@mail.com

+91 9866933582

పుష్కరాలు అంటే ఏమిటి...?


మన పురాణాల్లో పుష్కారాల గురించిన కథలు కొన్ని కనిపిస్తాయి. పూర్వం మహర్షులు భారతదేశం పుణ్యనదుల చరిత్ర, మహిమలను ప్రజలకు తెలియచెప్పారు. తీర్థరాజైన వరుణుని సర్వతీర్థాలలో గంగాది మొదలైన ద్వాదశ నదులలో ఒక సంవత్సరానికి ఒక నదిలో నివశించమని కోరారు. మహర్షుల విన్నపానికి వరుణ దేవుడు సమ్మతించాడు.
సూర్య, చంద్రాది గతులను బట్టి పరిగణలోకి తీసుకోవడం కుదరదు. కావున గురు సంచారాన్ని బట్టి తాను ఆయా నదుల్లో నివశిస్తానని మాటిచ్చాడు. దానినిబట్టి ఆయా నదులకు పుష్కరాలు జరుపుకోవాలని మహర్షులు నిర్ణయించారు.
అప్పటి నుంచి బృహస్పతి ఆయా రాశులలో సంచరించినప్పుడు గంగా దేవతాది 12 నదులకు పుష్కర ప్రవేశం కలిగి పుణ్య ప్రదేశాలయ్యాయి.