info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధనా




తుంగభద్రా నది తీరన కొలువైన మంత్రాలయం రమణీయమైన,అద్బుతమైన దివ్య క్షేత్రం .
శ్రావణ బహుళ ద్వితీయ నాడు క్రి . శ. 1671 లో అయన సజీవంగా సమాధిలోకి ప్రవేశించి జీవ సామాది అయినారు ఆ సమాధినే రాఘవేంద్ర బృందావనం అని పిలుస్తారు. ఆ బృందావనం నాటి నుండి నేటి వరకు గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా,దివ్య క్షేత్రనగా వీరాజిల్లుతున్నది. శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రహ్లాదుని అవతారమని భక్తుల విశ్వాసం . తనను నమ్మి తన దగ్గరికి వచ్చిన వారి కోరికలు,ఆపదలు తప్పకుండ తీర్చు మహిమన్మితమైన స్వామి . స్వామి బృందావనంతరం కూడా ఈ క్షేత్రం కి వచ్చే భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం . మూడు రోజుల పాటు జరిగే ఈ ఆరాధన ఉత్సవాలు ఎంతో ఘనంగా,దేదిప్యామనాంగా జరుగుతాయి .



కర్నూల్ జిల్లలో వెలసిన మహిమన్మితమైన క్షేత్రం రాఘవేంద్ర స్వామి దేవాలయం . కాంచి పట్టణానికి 26 మైళ్ళ దూరం లో గల భువనగిరి లో క్రి శ 1598 లో వెంకట బట్టు అనే బాలుడు జన్మించాడు . ఆయనే పెరిగి పెద్దవాడు అయి శ్రీ రాఘవేంద్ర స్వామి గ ప్రసిద్ది చెందాడు .




మహా తపాస్సంపన్నుడు జమదగ్ని మహర్షి, ఆయన బార్య రేణుకాదేవి మంచాల దేవతగా ఇక్కడ అవతరించింది అని ఆమె పేరు మీదే గ్రామానికి మంచాల అని స్థిరపడింది అని ఆ తరువాత అది మంత్రాలయ క్షేత్రంగా ప్రసిద్ది చెందింది అని స్థల పురాణం .


బృందావనం వెలసిన చోటే పూర్వం బక్త ప్రహలధుడు యజ్ఞం చేసాడని ,అతడే కలియుగం లో రాఘవేంద్ర స్వామి గ జన్మించాడని, విజయ నగర సామ్రాజ్యదినేత శ్రీ కృష్ణ దేవరల మత గురువు ఆయన శ్రీ వ్యాసరాయల వారే రాఘవేంద్ర స్వామి అని చెబుతుంటారు . తనను దర్శించిన బక్తుల కోరికలు తీర్చటమే కాకుండా వారికి మంచి ఆరోగ్యాన్ని , సిరి సంపదలను కలగచేస్తారు రాఘవేంద్ర స్వామీ. ఇక్కడకు దగ్గరలో పంచముఖి ఆంజనేయుని ఆలయం కలదు .


.