info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ కేదార్నాధ్ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం కేదార్నాధ్



భారతదేశంలోని అతి పవిత్రమైన యాత్రా స్థలాలలో ప్రముఖమైనది శ్రీ కేదార్నాథ్ దేవాలయం. హిమాలయ పర్వత శ్రేణులలో 12000 అడుగుల ఎత్తున కేదర్ అనే పర్వతం పై ఉంది. ఇది హరివార్ నుండి సుమారు 150 మైళ్ళ దూరంలో ఉంది. జ్యోతిర్లింగానికి చెందిన ఈ ఆలయం ఏడాదికి ఆరు నెలలు మాత్రమే తెరువబడి ఉంటుంది. ఇచట సంప్రదాయం ఏమిటంటే, కేదార్నాథ్ తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు భక్తులు మొదట యమునోత్రి మరియు గంగోత్రి సందర్శించి అచట నుండి పవిత్ర జలాలను కేదార్నాథ్ను అభిషేకిస్తారు. పురాణాల ప్రకారం విష్ణు భగవానుడి అవతారాలోన నర, నారాయణ లు యొక్క తీవ్ర తపస్సుకు మెచ్చి శివుడు జ్యోతిర్లింగ రూపంలో కేదార్నాథ్లో శాశ్వత నివాసం తీసుకున్నాడు. ఈ ప్రదేశంలో ప్రార్ధిస్తూ తన కోరికలు నెరవేరతాయని ప్రజలు నమ్ముతారు.

.






Route Map :-