info.manatemples@mail.com

+91 9866933582

రంగనాథ స్వామి దేవాలయం- ఏదులాబాద్, ఘటకేసర మండలం




రంగారెడ్డి జిల్లా ఘటకేసర మండలం లో ఏదులాబాద్ గ్రామం లో వెలసిన్ గోదా సమేత రంగనాథ స్వామి దేవాలయం. సికింద్రాబాద్ కి సుమారు 30 కి మీ దూరం లో ఘటకేసర మండల కేంద్రానికి 5 కి మీ దూరం లో వెలసిన క్షేత్రం గోదా సమేత రంగనాథ స్వామి దేవాలయం. సుమారు 500 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఇది . అందమైన రాజ గోపురం ,గోపురం పైన రక రకాల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఆలయ ఆవరణం లో పుష్కరిణి స్నానమాచరించి భక్తులు స్వామి దర్శనం చేసుకుంటారు . అద్బుతమైన కట్టడాలు ,చక్కని శిల్పకళా ఎంతో రమణీయంగా ఉంటుంది . వైష్ణవ సంప్రదాయం ప్రాకారం ఇక్కడ పూజ కార్యక్రమాలు జరుగుతాయి .


ఏదులాబాద్ కి పూర్వం రాయపురం అని పిలిచేవారు అట .అప్పన దేసిక చారి అనబడు బ్రాహ్మణోత్తముడు ఈ క్షేత్రాన్ని లో ఉండేవాడట . ఒక మహర్షి మంత్రోపదేశం తో తో అతడు మదురై సమీపం లో ఉన్న లిల్లి పొత్తుర్ లో గోదాదేవి ఆలయాన్ని దర్సిన్చుకున్నాడట ఆ సమయం లోనే గోదాదేవి అమ్మ వారు కలలో దర్శనం ఇచ్చి తనను రాయపురం తీసుకోని వెళ్ళమని చెప్పిందట . అలా దొరికిన విగ్రహాన్ని తీసుకోని వచ్చి గ్రామస్తుల సహాయం తో ఈ దేవాలయాన్ని నిర్మించారు అని స్థల పురాణం . ఇప్పటికి ఈ దేవాలయం లో ఆ వంశస్తులు ఈ దేవాలయానికి పూజ కార్యక్రామాలు నిర్వహిస్తున్నారు . ఒకప్పుడు ఈ ప్రాంతమంత చెట్లు ,గుట్టలు తో నిండి ఉండేది ఈ ప్రాంతం లో గరుడ పక్షుల సంచారం కూడా ఉండేది అట అందుకే దీనికి గరుడాద్రి అని కూడా పిలుస్తారు .


ఇక్కడ ఉన్న గోదాదేవి అమ్మవారిని గాజుల అండాలమ్మ అని పిలుస్తారట . ఒకసారి అమ్మ వారు ఉత్సవాల సమయం లో ఒక గాజుల దుకాణానికి వెళ్లి గాజులు వేసుకొని డబ్బులు నాన్న గారు ఇస్తారు అని చెప్పి వెళ్ళిపోయిందట. దుకన యెజమని ఆలయ అధికారిని అడగగా తనకు కుతర్లు లేరు అని చెప్పాడట ఆ తరువాత ఆలయం లోకి వెళ్లి చూడగా గాజులు అమ్మ వారి చేతికి ఉన్నాయి అట అందుకీ అప్పట్నుంచి ఇక్కడ ఉన్న అమ్మవార్ని గాజుల అండాలమ్మ అని కూడా పిలుస్తారు . అప్పట్నుంచి గ్రామస్థులు అమ్మవారిని ఇంటి అడపడుచుగా బావించి ఒడిబియ్యం పోస్టు ఉండాటం ఇక్కడ ఆచారం .


ఆలయం లో అమ్మవారిని దర్శించి కోరికలు కోరుకుంటే గోదాదేవి తప్పకుండ నెరవేరుస్తుంది అని భక్తుల భక్తుల ప్రాగడ విశ్వాసం.
బ్రహ్మోత్సవాలు ( శ్రవణ మాసం లో ఘనంగా జరుగుతాయి )మరియు గోదాదేవి కల్యాణం ఘనంగా జరుగుతాయి . ప్రతి ఒక్కరు తప్పకుండ దర్సించనియమైన క్షేత్రం ఇది .