info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ భూ నీలా సమేత శ్రీ రంగనాథ స్వామి దేవాలయం, వావిలవాలస, శ్రీకాకుళం జిల్లా




శ్రీ భూ నీలా సమేత శ్రీ రంగనాథ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా రాజమ్ లోని వావిలవాలసాలో కొలువై ఉంది . సాలగ్రామ్ రూపం లో స్వామి వారు కొలువై ఉన్న దివ్యమైన క్షేత్రం . శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని 150 సంవత్సరాల క్రితం ఇనుగంటి రాజులు నిర్మించారు, శ్రీ రాజ ఇనుగంటి సీతారామ రాయణం గారు లేదా రాజా ఇనుగంటి జగ్గరాయణం గారు నిర్మించినట్లు ఆదారాల ద్వారా తెలుస్తుంది.


ఇనుగంటి కుటుంబానికి చెందిన వంశపారంపర్యమైన ధర్మకత్రుత్వ మండలి మరియు శ్రీ రంగనాథ స్వామి భక్తులు దేవాలయ నిర్వహణ చూసుకుంటున్నారు . ప్రస్తుత ఆలయం ధర్మకర్త శ్రీ ఇంగంటి అండలమ్మ గారు.


గర్భాలయం లో కొలువైన రంగనాథుడు చూడడానికి రెండు కళ్ళు సరిపోవా అన్న విదంగా ధర్శనమిస్తారు. దేవాలయం చూడడానికి మనకు చిన్నగా కనిపించిన కానీ ఆలయం లో ఉన్న దేవత మూర్తులను చూస్తే మనకు యెంతో దేదీప్యమంగా దర్శనమిస్తాయి . స్వామి వారికి ప్రతి నిత్యం జరిగే విశేషమైన పూజా కార్యక్రమాలతో పాటు పండుగలప్పుడు,ధనుర్మాసం లో విశేషమైన సేవలు నిర్వహించబడుతాయి .




Route Map:-